భక్తులు లేకుండానే... తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు

  • మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు
  • కల్యాణోత్సవ మండపంలో నిర్వహణ
  • స్వర్ణ రథోత్సవాన్ని రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో నిర్వహించే సాలకట్ల వసంతోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. అలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపం ప్రాంగణంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. కాగా, తిరుమలలో రద్దీ సాధారణం కన్నా తగ్గింది. నిన్న స్వామివారిని దాదాపు 15 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.

Tirumala
Tirupati
Vasantotsavalu
Piligrims

More Telugu News